ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 32 ఏళ్ల మహిళ తన పెంపుడు పిల్లి ప్రమాదవశాత్తు చనిపోయింది. అయితే పిల్లి మరణం తట్టుకోలేక సదరు మహిళ ఆత్మహత్య చేసుకుంది. శనివారం రాత్రి, ఆమె తన గదికి లాక్ చేసుకుని సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.