కౌంటింగ్ కేంద్రం వద్ద మహిళా కానిస్టేబుల్‌‌కు తేలు కాటు

78చూసినవారు
కౌంటింగ్ కేంద్రం వద్ద మహిళా కానిస్టేబుల్‌‌కు తేలు కాటు
నల్గొండ పట్టణ పరిధిలోని దుప్పలపల్లి గోదాం వద్ద జరుగుతున్న నల్గొండ- వరంగల్- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ కేంద్రం వద్ద అపశృతి చోటు చేసుకుంది. బుధవారం రాత్రి మీడియా సెంటర్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ కానిస్టేబుల్ తేలు కాటుకు గురైంది. వెంటనే అధికారులు 108 వాహనంలో జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కానిస్టేబుల్ ఆరోగ్యం మెరుగు పడినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్