TS ఈఏపీసెట్ 24 పరీక్షా కేంద్రాలను పెంచే యోచనలో JNTU అధికారులు ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ, AP వ్యాప్తంగా ఇంజినీరింగ్ లో 1,93,468 దరఖాస్తులు రాగా.. అగ్రికల్చర్, ఫార్మసీలో 71,999 మంది దరఖాస్తు చేశారు. ఇంకా దరఖాస్తు గడువుకు 9రోజుల సమయం ఉంది. పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశాలను దృష్టిలో పెట్టుకొని రెండు రాష్ట్రాల్లో అదనంగా సెంటర్లు మరిన్ని పెంచాలని సమాలోచనలు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.