కార్మికులకు న్యాయ విజ్ఞాన సదస్సు

80చూసినవారు
అంతర్జాతీయ కార్మిక మేడే దినోత్సవ సందర్భంగా యాదాద్రి జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజు ఆదేశాల మేరకు సీనియర్ సివిల్ జడ్జి మాధవి లత న్యాయవిజ్ఞాన సదస్సు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. కార్మికులకు చట్టపరమైన సంక్షేమ పథకాలు న్యాయ సహాయం అర్హతల అంశాలపై అవగాహన కల్పించారు. భువనగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షులు హరినాథ్ గౌడ్, న్యాయవాదులు కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్