స్వర్ణగిరికి పోటెత్తిన భక్త జనం

83చూసినవారు
భువనగిరి పట్టణ సమీపంలో ఉన్న స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం భక్తులు పోటెత్తారు. మే డే సెలవు దినం కావడంతో భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకుని క్యూలైన్లలో నిలబడి స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వర్ణగిరి ఆలయాన్ని చూసేందుకు గత కొన్ని రోజులుగా తండోపతండాలుగా జనం తరలి వస్తున్న విషయం విధితమే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్