విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయొద్దు: మణికంఠ గౌడ్

73చూసినవారు
విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయొద్దు: మణికంఠ గౌడ్
ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని సోమవారం ఏబీవీపీ ఉమ్మడి నల్గొండ జిల్లా విభాగ్ కన్వీనర్ సుర్వి మణికంఠ గౌడ్ డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న 8000 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియింబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలన్నారు. స్కాలర్షిప్ విడుదల కాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్