హైదరాబాద్ లోని విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే కుంభం

3310చూసినవారు
భువనగిరిలో అస్వస్థతకు గురైన విద్యార్థులు ఇద్దరు ప్రశాంత్ కళ్యాణ్ కృష్ణ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శనివారం సాయంత్రం ఆసుపత్రికి చేరుకొని విద్యార్థుల ఆరోగ్య బాగోగులను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ధైర్యంగా ఉండాలని తెలిపారు. విద్యార్థులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్