బీహార్లోని ముజఫర్పూర్లో దారుణం జరిగింది. నితీశ్ కుమార్ అనే యువకుడు బైక్ పై నుంచి కిందపడటంతో అతని కాలు విరిగింది. దీంతో మినపూర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆ యువకుడు వెళ్తే డాక్టర్లు వినూత్నంగా వైద్యం చేశారు. విరిగిన కాలుకు ప్లాస్టర్కు బదులు అట్టపెట్టను కట్టి చికిత్స చేశారు. అంతేకాకుండా.. ఆస్పత్రిలో ఆ యువకుడిని పట్టించుకున్న నాథుడే లేడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఐదు రోజుల పాటు ఏ వైద్యుడు అతని వద్దకు రాలేదని వాపోయారు.