ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో ప్రియురాలిని కలిసేందుకు ఓ యువకుడు బురఖా ధరించాడు. దొంగగా, పిల్లలను కిడ్నాప్ చేసే మనిషిగా భావించి, అనుమానించిన స్థానికులు బురఖా తొలగించారు. అతడ్ని పట్టుకుని కొట్టి పోలీసులకు అప్పగించారు. అతడి వద్ద పిస్టల్ కూడా ఉందని కొందరు ఆరోపించారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.