AP: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24 నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది. ఫస్టియర్ విద్యార్థులకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపింది. సెకండియర్ స్టూడెంట్స్కి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 వరకు పరీక్షలు జరుగుతాయని వివరించింది.