ప్రభుత్వ రంగంలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్) 2023-24 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 25.6 శాతం తగ్గుదలతో రూ.489.62 కోట్ల నికర లాభాలు ప్రకటించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.658.02 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.8,226.99 కోట్లుగా ఉన్న రెవెన్యూ.. గడిచిన క్యూ4లో 0.4 శాతం పెరిగి రూ.8,260.25 కోట్లుగా చోటు చేసుకుంది.