AP: ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ల లబ్ధిదారులకు పెంచిన మొత్తంతో కలిపి జులై 1న రూ.7,000 పింఛన్ అందజేయనున్నట్లు టీడీపీ తెలిపింది. "పింఛన్ల లబ్ధిదారులకు చంద్రబాబు ఇచ్చిన మాట నెరవేర్చబోతున్నారు. రూ.1000 పెంచగా అయిన రూ.4000, గత మూడు నెలల పెంపు రూ.3000 కలిపి రూ.7000 పింఛన్ ఎన్టీఆర్ భరోసా పేరుతో జూలై 1న ఇంటి వద్దే అందించనున్నారు." అని పేర్కొంటూ టీడీపీ ట్వీట్ చేసింది.