బద్వేల్: యువతి హత్యాయత్నం ఘటనపై స్పందించిన ఎస్పీ

బద్వేలులో యువతిపై జరిగిన హత్యాయత్నంపై కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పందించారు. బద్వేల్ కు చెందిన యువతికి విగ్నేశ్ అనే యువకుడితో చాలా కాలంగా పరిచయం ఉంది. తనతో మాట్లాడాలని విఘ్నేశ్ యువతిని పిలిచి హత్యాయత్నం చేశాడని బాధితురాలు చెప్పింది. నిజానిజాలు తెలుసుకుని నిందితుడికి శిక్ష పడేలా చూస్తాం అని ఎస్పీ చెప్పారు. ముందుగా ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసులో నిందితుడి కోసం 4 బృందాలు గాలిస్తున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్