సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేకులు పడ్డాయి. శనివారం రాత్రి సీఎం జగన్పై రాయి దాడి జరిగిన విషయం తెలిసిందే. గాయం తగ్గేంతవరకు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దాంతో ఆదివారం జరగాల్సిన బస్సు యాత్రకు విరామం ప్రకటించారు. తదుపరి షెడ్యూల్కు సంబంధించిన వివరాలను ఇవాళ వైసీపీ వెల్లడించనుంది.