వంగవీటిని చంపింది చంద్రబాబే: పొసాని

వంగవీటి రంగాను చంపింది చంద్రబాబేనని ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ పొసాని కృష్ణ మురళి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘వంగవీటి రంగాను చంపింది మాజీ సీఎం చంద్రబాబేనని, ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలుసని అన్నారు. ఐదు జిల్లాల్లో వంగవీటి రంగా అంటే తెలియని వారు లేరని.. ఆ రోజుల్లో ఎన్టీఆర్ కంటే గొప్పవాడని, అతని క్రేజ్‌ను చూసి ఓర్వలేకపోయారన్నారు. తనకు ప్రాణహాని ఉందని వంగవీటి రంగా నాడు రాజీవ్ గాంధీకి లేఖ కూడా రాశారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్