AP: ఇసుక రవాణా సమయంలో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇసుక రవాణా చేసే వాహనాలపై టార్పాలిన్ కవర్ తప్పనిసరిగా కప్పాలని స్పష్టం చేసింది. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఇసుక తవ్వకాల అనుమతులు పొందిన GCKC, ప్రతిమ సంస్థలకు ఆదేశాలిచ్చింది. రవాణా చేయాల్సిన సమయాలపై జులై 31న తీర్పు వెల్లడిస్తామని పేర్కొంది.