కుక్క కాటుకు కొడుకు.. మనస్థాపంతో తండ్రి మృతి

పెంపుడు కుక్క కరవడంతో విశాఖ జిల్లా భీమిలిలో ఓ యువకుడు మృతి చెందాడు. భార్గవ్(27) కు ముక్కు మీద, అతని తల్లికి పెంపుడు కుక్క కరిచింది. రెండు రోజుల తర్వాత ఆ కుక్క చనిపోయింది. దాంతో భార్గవ్, అతని తల్లి రెబీస్ నివారణ ఇంజెక్షన్ తీసుకున్నారు. అయితే భార్గవ్ తండ్రి పక్షవాతానికి గురై మంచానికే పరిమితయ్యారు. తండ్రి కోసం ఆస్పత్రి చుట్టూ భార్గవ్ తిరిగాడు. రెండో టీకా తీసుకోకపోవడంతో అతడి శరీర అవయవాలకు రెబీస్ వ్యాపించి మరణించాడు. దాంతో మనస్థాపానికి గురై తండ్రి ప్రాణాలు విడిచాడు. భార్గవ్ తల్లి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్