AP: రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావులేకుండా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా సహా రాయలసీమ ప్రాంతంలో ఎన్నికల అనంతరం హింస చెలరేగిన నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు రాష్ట్ర సీఈవో సహా ఇతర ఉన్నతాధికారులకు సూచనలు జారీ చేశారు.