ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మరో MLA అభ్యర్థిని జనసేన పార్టీ ఖరారు చేసింది. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం నుంచి జనసేన నేత చిర్రి బాలరాజు బరిలో దిగనున్నారు. బాలరాజుకు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ.. పోలవరంలో భారీ మెజారిటీ సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. మూడు పార్టీల(టీడీపీ, జనసేన, బీజేపీ) శ్రేణులను కలుపుకొని పని చేస్తానని చెప్పారు.