AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కృష్ణా జిల్లాలోని విజయవాడ, గన్నవరం, ఉయ్యూరు, ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పాణ్యం, బనగానపల్లె, శ్రీశైలం, అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం, ఉరవకొండ, రాయదుర్గం, గుంతకల్లు, తాడిపత్రి, ధర్మవరం, మడకశిరలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.