కాంగ్రెస్ పార్టీ దుష్పరిపాలనకు ఏపీ పెద్ద బాధిత రాష్ట్రమని వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. సోమవారం పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశం ఏనాడూ లేదని.. ఇప్పుడు దాన్నొక ఒక ఎన్నికల అంశంగా మార్చాలని చూస్తోందని విమర్శించారు. ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ క్షమించరని వ్యాఖ్యానించారు.