టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్రం భద్రత పెంచింది. మొత్తం 24 మంది SPG బ్లాక్ క్యాట్ కమాండోలతో ఆయనకు రక్షణ కల్పించనున్నారు. రెండు బ్యాచ్లుగా 12x12 విధానంలో విధులు నిర్వర్తించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఆయనకు భద్రత పెంచినట్లు సమాచారం. చంద్రబాబుకు ఇంత భద్రత పెంచటంతో రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చగా మారింది.