సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశావర్కర్ల ధర్నా

పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆశ వర్కర్స్ ఒప్పంద జీవో కాఫీలు ఇవ్వాలని సీఐటీయూ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జి ధరించి మంగళవారం ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ. ఆశా వర్కర్కు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఆశ వర్కర్ సమస్యలపై జిల్లాలో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఒప్పంద జీవోలు వెంటనే ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ బాబావలి, ఆశ వర్కర్స్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్