బాధిత కుటుంబానికి మాజీ మంత్రి పరామర్శ

గోరంట్ల‌ మండలం దిగువ గంగంపల్లి తాండాలో పిడుగుపాటుతో మృతి చెందిన కుటుంబాన్ని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్ మంగళవారం పరామర్శించారు. ఈ సందర్బంగా దాశరధి నాయక్, దేవి బాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని ఓదార్చారు. అధైర్యపడకండి మీకు అండగా మేమందరం వున్నాం అని భరోసా కల్పించారు. ఆమె వెంట ప్రజాప్రతినిధులు, నాయకులు వున్నారు.

సంబంధిత పోస్ట్