మండల స్థాయి స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన ఎంపీ

శ్రీసత్యసాయి జిల్లా రొద్దం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మండల స్థాయి స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ బి కే పార్థసారథి పాల్గొన్నారు. అనంతరం అయన మాట్లాడుతూ పిల్లలు ఆటల పోటీల్లో పాల్గొనడం మంచిదని, అంతేకాకుండా చదువులో కూడా లక్ష్యంతో ముందుకు వెళ్లి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కోరారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్