హైవేలో రోడ్డు ప్రమాదం

శ్రీ సత్యసాయిజిల్లా సోమందేపల్లి మండలం కియా అనుబంధ సంస్థ ఎస్ఎల్ పి పరిక్రమ ముందు, జాతీయ రహదారీ పై రోడ్డు ప్రమాదం జరిగింది. చింతామని నుండి అనంతపురం వైపు వెళ్తున్న బొలేరో వాహనం ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరో డ్రైవర్ కి గాయలయ్యాయి. వెంటనే స్థానిక ప్రజలు అతన్ని బయటకు తీసి పక్కన కూర్చోబెట్టి అంబులెన్సుకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్