తక్కువ పెట్టుబడితో నాణ్యమైన అధిక దిగుబడులు

తక్కువ పెట్టుబడితో, నాణ్యమైన అధిక దిగుబడులు, నికర ఆదాయం పెరగడానికి ఈ విస్తరణ కార్యక్రమం ఉపయోగపడుతుందని పెనుకొండ డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు స్వయంప్రభ తెలిపారు. మంగళవారం పెనుకొండ మండలంలోని ఎర్రమంచి గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధ శాఖల పథకాల గురించి విస్తృతంగా చర్చించారు. కార్యక్రమంలో టీడీపీ పెనుకొండ టౌన్ కన్వీనర్ శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్