పుట్లూరు మండలంలో జిల్లా వ్యవసాయాధికారి పర్యటన

పుట్లూరు మండలంలో జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ మంగళవారం పర్యటించారు. మండల పరిధిలోని చెర్లోపల్లి గ్రామంలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి కాత్యాయనితో కలిసి రబీలో సాగు చేయబోతున్న పప్పు సెనగ పంటలపై సూచనలు సలహాలు అందజేశారు. పంటల బీమాకు రైతులే స్వయంగా ప్రీమియాన్ని చెల్లించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్