AP: లోక్సభ ఎంపీ, పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతపై మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత SVSN వర్మ సంచలన ఆరోపణలు చేశారు. కాకినాడ ఈహెచ్ఎస్ ఆస్పత్రిలో ఉద్యోగాలకు రూ. 10 లక్షల చొప్పున లంచం తీసుకుంటున్నారని ఆరోపించారు. ఉద్యోగాల విషయంలో రూ.కోట్ల స్కామ్ జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక విచారణ చేయిస్తామని అన్నారు. ఈ వ్యాఖ్యలపై వంగా గీత స్పందించాల్సి ఉంది.