ప‌ల్నాడు జిల్లాలో ఉద్రిక్త‌త‌.. గాల్లోకి కాల్పులు

AP: పల్నాడు జిల్లా కొత్తగణేషునిపాడులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిన్న కొందరు వైసీపీ కార్యకర్తల ఇళ్లను టీడీపీ నేతలు కూల్చేయ‌గా.. మహిళలు రాత్రంతా ఆల‌యంలో తలదాచుకున్నారు. ఈ క్ర‌మంలో తమ శ్రేణులను పరామర్శించేందుకు వెళ్లిన గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కాన్వాయ్‌పై టీడీపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.

సంబంధిత పోస్ట్