ఏపీలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 25న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు జులై 2 తుది గడువు, ఉపసంహరణకు జులై 5 వరకు గడువు ఉంది. జులై 12న పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి. షేక్ ఇక్బాల్, సి.రామచంద్రయ్యపై మండలి ఛైర్మన్ అనర్హత వేటు వేసిన నేపథ్యంలో ఆ రెండు స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది.