ఎస్ కోటలో ఉప్పొంగిన వర్షపు నీరు

ఎస్ కోటలో మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధానంగా కన్నెంగెడ్డ ఉప్పొంగి ప్రవహించడంతో స్థానిక ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. పలు కాలనీలు, రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో స్థానికులు ఇక్కట్లకు లోనయ్యారు. పట్టణంలో భూ కబ్జాదారులు యదేచ్ఛగా అక్రమణలకు పాల్పడడమే ఈ సమస్యకు ప్రధాన కారణమని, ఇప్పటికైనా అధికారులు భూ కబ్జాదారులపై చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్