సమాచారం ఇచ్చాకే పోస్టల్ బ్యాలెట్ల తరలింపు

విజయనగరం తహసీల్దార్ కార్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న విజయనగరం ఎంపీ స్థానం పరిధిలోని పోస్టల్ బ్యాలెట్లను కలెక్టరేట్ కు గురువారం తరలించామని జేసీ కె. కార్తీక్ తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సమాచారం ఇచ్చామని, హాజరైనవారి సమక్షంలోనే తరలించి భద్రపరచడం, జరిగిందన్నారు. కొన్ని పార్టీల అభ్యర్థులకు సమాచారం ఇవ్వకుండా పోస్టల్ బ్యాలెట్లు తరలించారన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.

సంబంధిత పోస్ట్