ఏపీ కొత్త సీఎస్గా విజయానంద్ నియమితులయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం APSPDCL ఛైర్మన్, ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ప్రధాన ఎన్నికల అధికారిగానూ ఆయన వ్యవహరించారు. కాగా, ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లారు. వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొన్న జవహర్రెడ్డిని కొత్త ప్రభుత్వం పక్కన పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.