హజ్ యాత్రలో 1,300 మంది మృతి

సౌదీ అరేబియాలో ఈ ఏడాది హజ్ యాత్ర సందర్భంగా అధిక ఉష్ణోగ్రతలతో 1,300ల మందికి పైగా మరణించారని అధికారులు తాజాగా ప్రకటించారు. సౌదీ ఆరోగ్య మంత్రి ఫహద్ బిన్ అబ్దుర్రహ్మాన్ అల్-జలాజెల్ మాట్లాడుతూ.. 1,301 మంది చనిపోయారన్నారు. 95 మంది యాత్రికులు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారన్నారు. మృతుల్లో 660 మంది ఈజిప్ట్ వారు కాగా, భారత్‌కు చెందిన 130 మంది సైతం చనిపోయారు. కాగా, సౌదీలో 51 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్