పాలస్తీనాకు మద్దతుగా ధర్నా నిర్వహించినందుకు భారత సంతతి విద్యార్థిని అచింత్యా శివలింగన్ను అమెరికాలోని పిన్స్టన్ విశ్వవిద్యాలయం అరెస్ట్ చేసి క్యాంపస్ నుంచి బహిష్కరించింది. అచింత్యాపై క్రమశిక్షణ చర్యలు సైతం తీసుకోనున్నట్టు వర్సిటీ అధికారి ప్రతినిధి గురువారం వెల్లడించారు. సుమారు వంద మంది విద్యార్థులు వర్సిటీలో గుడారాలు వేసుకొని ఆందోళన చేశారు.