ఓ యువకుడు తమిళనాడు రాష్ట్రం తిరుచ్చిలోని కొల్లిడం నది వంతెనపై రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్పై తన మోటార్బైక్ను ప్రమాదకరంగా నడుపుతూ కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ నెల 23న పెరుంబిడుగు ముత్తురైయార్ జయంతి సందర్భంగా ఆ సంఘానికి చెందిన పలువురు యువకులు తిరుచ్చిలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నగరంలో బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్బంగా యువకుడు తన బైక్ ఇలా నడిపాడు.