ఉత్తరప్రదేశ్ వారణాసిలోని ప్రఖ్యాత కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని గురువారం ఉదయం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన భార్యతో కలిసి సందర్శించారు. అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాశీ విశ్వనాథుడికి అభిషేకం, కుంకుమార్చన చేశారు. పూజ అనంతరం ఆలయ ప్రధాన అర్చకుల వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు.