కేరళలో రుతుపవనాల ప్రవేశానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మరో 5 రోజుల్లో రుతుపవనాలు కేరళలో ప్రవేశిస్తాయని స్పష్టం చేసింది. ఈ ఏడాది ఈశాన్య భారత్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. వాయవ్య భారత్లో సాధారణ వర్షపాతం,
మధ్య, దక్షిణ భారత్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని వివరించింది.