భారత్ టీ20 ప్రపంచకప్ గెలవాలంటే అన్ని విభాగాలూ బలంగా ఉండాలని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం భారత జట్టులో బ్యాటింగ్, బౌలింగ్ ఆప్షన్లు ఎక్కువగా ఉన్నాయని.. సరైన తుది జట్టును ఎంపిక చేసుకుంటే కప్ను నెగ్గడం పెద్ద కష్టమేం కాదని తెలిపారు. పిచ్ పరిస్థితిని బట్టి తుది జట్టు ఎంపిక ఉండాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ మంచి ఫామ్లోనే ఉన్నారనిపిస్తోందని, సరైన టీమ్తో దిగితే ఛాంపియన్గా నిలుస్తామని అన్నారు.