AP: అనంతపురం పోలీసులు మొబైల్స్ రికవరీలో సరికొత్త రికార్డు సృష్టించారు. సెల్ఫోన్లు రికవరీలో అనంతపురం జిల్లా దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. 2022 నుంచి 11, 378 ఫోన్లను రికవరీ చేసి, వాటి యజమానులకు అందజేశారు. రికవరీ చేసిన సెల్ఫోన్ల విలువ దాదాపు రూ.21.08 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. తాజాగా 1183 ఫోన్లు బాధితులకు ఇచ్చినట్లు జిల్లా పోలీసులు వెల్లడించారు.