తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో ఎమ్మెల్యే సంజయ్ కలిశారు. సంజయ్ కి కండువా కప్పిన సీఎం రేవంత్.. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాగా రెండు రోజుల క్రితం బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే.