రాంచీలో జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. భారత స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ మాయాజాలానికి కీలక రెండు వికెట్లు కోల్పోయింది. ఈ మేరకు 4.5 వద్ద డకెట్ ఔటవ్వగా.. అ వెంటనే 4.6 వద్ద ఒలీపోప్ మొదటి బంతికే డకౌటయ్యాడు. ప్రస్తుతం క్రీజ్లో జాక్ క్రాలే, జో రూట్ లు కొనసాగుతున్నారు.