అసోం వరదలు.. 3.90 లక్షల మందిపై ప్రభావం

అసోంలో ఇటీవల ముంచెత్తిన వరదలు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో వరదల కారణంగా 3.90 లక్షల మందికి పైగా ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారని అధికారులు శనివారం తెలిపారు. తాజా నివేదిక ప్రకారం, వరదలు, కొండచరియలు విరిగిపడటం, తుఫాను కారణంగా ఈ ఏడాది మరణించిన వారి సంఖ్య 37కి చేరుకుంది. 171,000 మందికి పైగా ప్రజలు తమ నివాసాలు కోల్పోయి నిరాశ్రయులు కాగా, 15,160 మంది తాత్కాలిక సహాయ శిబిరాల్లో తలదాచుకున్నారని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్