లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చారు. బీజేపీ మేనిఫెస్టోపై ఆయన మాట్లాడుతూ.. ‘80 బనేగా ఆధార్, ఎన్డీఏ 400 పార్, ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్’ అనే కొత్త నినాదాన్ని ప్రారంభించారు. ‘బీజేపీ సంకల్ప్ పత్రం మోదీ హామీ. ఇది అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి మా అంకితభావాన్ని పునరుద్ఘాటిస్తుంది’ అని పేర్కొన్నారు.