అయోధ్య రామమందిరం ఆవరణలో మొబైల్ ఫోన్ల వినియోగంపై నిషేధం విధించారు. భద్రతా కారణాల రీత్యా ఈ మేరకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నిర్ణయం తీసుకుంది. భక్తులు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని, ఆలయ అధికారులకు సహకరించాలని ట్రస్టు సభ్యులు కోరారు.