పీవీ నరసింహారావుకు భారతరత్న

తెలుగు బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ భారత రత్న అవార్డును ప్రదానం చేశారు. పీవీ నరసింహారావు కుమారుడు పీవీ ప్రభాకర్ రావు ఈ అవార్డును అందుకున్నారు. రాష్ట్రపతి భవన్ లో భారత రత్న అవార్డు ప్రధానోత్సవం జరిగింది. పీవీ ఫ్యామిలీతో పాటు నలుగురు ప్రముఖులు భారతరత్న అందుకున్నారు. పీవీ ప్రభాకర్ రావు, కర్పూరీ ఠాకూర్, స్వామినాథన్, చరణ్ సింగ్ కుటుంబ సభ్యులు ఈ అవార్డు అందుకున్నారు.

సంబంధిత పోస్ట్