సిలిండర్ పేలి తల్లి సహా ముగ్గురు చిన్నారులు మృతి

593చూసినవారు
సిలిండర్ పేలి తల్లి సహా ముగ్గురు చిన్నారులు మృతి
ఉత్తరప్రదేశ్‌లోని డోరియా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. శనివారం ఉదయం జిల్లాలోని డుమ్రిలో ఉన్న ఓ ఇంట్లో సిలిండర్‌ పేలడంతో నలుగురు మృతిచెందారు. డుమ్రిలో ఓ గృహిని ఛాయ్ పెడుతుండగా.. గ్యాస్‌ లీకై సిలిండర్‌ ఒక్కసారిగా పేలింది. దీంతో మంటలు అంటుకుని గృహిని సహా ఆమె ముగ్గురు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్