యూపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దేవరియా జిల్లాలోని డుమ్రిలో ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు సిలిండర్ పేలి తల్లితో సహా ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. చాయ్ పెడుతున్న సమయంలో గ్యాస్ లీకై సిలిండర్ పేలినట్లు ఎస్పీ సంకల్ప్ శర్మ తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.