ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు శుక్రవారం భారీ షాక్ తగిలింది. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు గురువారం ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష పూచీకత్తుతో కేజ్రీవాల్ను విడుదల చేయొచ్చని పేర్కొంది. దీంతో ఢిల్లీ హైకోర్టును ED ఆశ్రయించింది. ఈ క్రమంలో కేజ్రీవాల్ బెయిల్ మంజూరుపై తాత్కాలిక స్టే విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.